పీవీ,ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలి: అక్బరుద్దీన్

by  |
పీవీ,ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలి: అక్బరుద్దీన్
X

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4700 ఎకరాలు ఉండే హుస్సేన్ సాగర్..ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదని ఆయన అన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేస్తామని ప్రభుత్వం చెబుతోందని..అలా అయితే హుస్సేన్ సాగర్ పై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చి వేయాలని అన్నారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ఇవ్వలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా మళ్లీ మాయ మాటలు చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసని టీఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు.


Next Story

Most Viewed