దేశ భద్రతతో మూడిపడిన అంశం : అమరీందర్ సింగ్

by  |
దేశ భద్రతతో మూడిపడిన అంశం : అమరీందర్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై రైతుల ఆందోళన పంజాబ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రమే దెబ్బతీయదని, దేశ భద్రతతో ముడిపడిన అంశమని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఇరు పక్షాలు కలసి పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత అమరీందర్ సింగ్ విలేకరులతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చల్లో తాను చేసిది ఏమీ లేదని తెలిపారు. కేంద్ర హోంమంత్రితో జరిపిన సమావేశంలో నూతన సాగు చట్టాలపై తన వ్యతిరేకతను తెలిపినట్లు వివరించారు. ఈ అంశం పంజాబ్ ఎకానమీతో పాటు జాతీయ భద్రతకూ చెందిన విషయం కావున వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని అమిత్ షాను కోరినట్లు తెలిపారు.


Next Story

Most Viewed