- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: దక్షిణాదితో పాటు అటు బాలీవుడ్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. కెరీర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మొహంజోదారో’తో బాలీవుడ్కు పరిచయమైనా, ఆ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో పూజకు అక్కడ అవకాశాలు సన్నగిల్లాయి. అయితే, ‘హౌజ్ఫుల్ 4’ సినిమాలో బీటౌన్లో రెండో అవకాశం దక్కించుకుంది ఈ భామ. కాగా ఇంతకాలం గ్యాప్ రావడానికి కారణమేంటో తాజాగా వివరించింది.
ఇర తాజాగా బాలీవుడ్లో రణ్వీర్సింగ్ సరసన ‘సర్కస్’ అనే చిత్రంలో నటించబోతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన పూజా హెగ్డే.. బాలీవుడ్లో తన ప్రయాణం అంతగా గొప్పగా ప్రారంభం కాలేదని తన మనసులో మాట బయటపెట్టింది. ‘బాలీవుడ్లో నా తొలిచిత్రం ఫెయిల్ కావడంతో చాలా బాధపడ్డాను. ఆ షాక్ నుంచి నేను తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎవరికైనా మొదటి సినిమా ఎంతో కీలకమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి ప్రయత్నమే ఫెయిల్యూర్గా మిగిలిపోవడంతో చాలా విరామం తీసుకున్నా. అయితే దక్షిణాదిన విజయం సాధించడంతో ధైర్యంగా ముందుకు సాగాను. కొన్నేళ్ల తర్వాత ‘హౌస్ఫుల్ 4’తో విజయాన్ని దక్కించుకున్నా. ప్రస్తుతం తెలుగులో కెరీర్ అద్భుతంగా సాగుతోంది’ అని చెప్పుకొచ్చింది. తెలుగులో ఈ భామ ‘రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ఇక రణ్వీర్తో చేస్తున్న సర్కస్ సినిమా.. ‘అంగూర్’ (1982) చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతోంది. దీనికి ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
‘నేను రోహిత్ సర్కు వీరాభిమానిని. ఆయన సినిమాల్లో ఫుల్ కామెడీ ఉంటుంది. సింగమ్, సింబా, మరేదైనా కానీ, ఆయన సినిమాలు చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అలాంటిది రోహిత్తో కలిసి పని చేస్తున్నానంటే సంతోషం పట్టలేకున్నాను. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్నాన’ అని పూజా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.