హైదరాబాద్‌లో మళ్లీ మొదలైంది : పూజ

by  |
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైంది : పూజ
X

దిశ, వెబ్‌డెస్క్ :
బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే.. మరోసారి చెఫ్ పూజగా మారినట్లు ఇటీవలే ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. శనివారం తన తండ్రికి ‘డెలిషియస్ జానీ టామరిండ్ హైబాల్’ తయారు చేసిచ్చిన పూజ.. చీర్స్ చెప్పింది. అంతేకాదు, దాన్ని ఎలా తయారు చేయాలో కూడా వివరించింది. ఇక ఈ వీకెండ్ తన తండ్రితో ముంబైలో హ్యాపీగా గడిపేసి, ఆదివారం జాలీగా హైదరాబాద్ వచ్చేసింది పూజ. అందుకు గల కారణమేంటో కూడా తనే చెప్పేసింది.

పూజ.. ప్ర‌స్తుతం ప్రభాస్‌తో క‌లిసి రాధేశ్యామ్ చిత్రంలో న‌టిస్తుండగా, లాక్‌డౌన్ కారణంగా ఇన్నిరోజులు షూటింగ్ వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా షూటింగ్స్‌కు అనుమతులు లభించడంతో.. అన్ని చిత్ర యూనిట్స్ శరవేగంగా తమ చిత్రాల షూటింగ్స్‌ను కానిచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘రాధే శ్యామ్’ షూటింగ్ కూడా మొదలు కాగా.. ఆ చిత్ర యూనిట్‌తో చేరిపోయింది బుట్టబొమ్మ. అదే విషయాన్ని పూజ తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘సో ఇట్స్ బిగిన్స్.. హైదరాబాద్’ అని చెప్పేసింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ పనులు జరుగుతున్నాయి.

ఇక పూజా హెగ్డే.. రాధేశ్యామ్‌తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో అఖిల్‌కు జోడీగా న‌టిస్తోంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అటు ప్రభాస్ కూడా ‘రాధేశ్యామ్’ సినిమా తర్వాత.. మహానటి ఫేం నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ‘ఆది పురుష్’ మూవీతో బాలీవుడ్‌లో స్ట్రెయిట్ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నాడు.


Next Story

Most Viewed