తోటి ఉద్యోగులపై గన్ ఫైర్.. 8 మంది మృతి

by  |
తోటి ఉద్యోగులపై గన్ ఫైర్.. 8 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌ పట్టణంలో ఓ ఉద్యోగి కాల్పుల జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్‌ అథారిటీ ఉద్యోగి సామ్‌ కాసిడీ అనే వ్యక్తి.. ఈరోజు ఉదయం ట్రాన్సిట్ కంట్రోల్ సెంటర్, రైళ్ల పార్కింగ్, మెయింటెనెన్స్ యార్డ్ వద్ద కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. మరణించిన వారిలో నిందితుడితో పాటు ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన కాసిడీ.. తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed