ఎమ్మార్వో ఆఫీస్‌లో ఆత్మహత్యాయత్నం

by  |
ఎమ్మార్వో ఆఫీస్‌లో ఆత్మహత్యాయత్నం
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలోని ఓ తహసీల్దార్ కార్యాలయంలో తండ్రీకూతురు ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు, స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం చెంచరువుపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతిరెడ్డి, తన కూతురు స్వరూప పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు వేరొకరి పేరు మీద పట్టాచేశారు. దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా కొహెడ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము పెట్రోల్ పోసుకోని ఆత్యహత్య చేసుకున్నామని భీంరెడ్డి తిరుపతిరెడ్డి, స్వరూప వాపోయారు. కాగా పెట్రోల్ బాటిల్స్ వచ్చిన బాధితులను కార్యాలయ సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు.

Next Story

Most Viewed