పరీక్షల రద్దుపై హర్షం

by  |
పరీక్షల రద్దుపై హర్షం
X

దిశ, న్యూస్‌బ్యూరో: పదో తరగతి పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. కరోనా విస్తరిస్తున్న సమయంలో ఇదే సరైన పరిష్కారమని టీఎస్‌యూటీఎఫ్ పేర్కొంది. మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తే పిల్లలకు కొంతమేరకు న్యాయమే జరుగుతుందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. విద్యార్థులకు భవిష్యత్‌లో ఎలాంటి నష్టం కలగకుండా రీమార్క్స్‌ను మెమోలో స్పష్టంగా రాయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రమణ, మైస శ్రీనివాసు ఓ ప్రకటనలో కోరారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయాలనే నిర్ణయం హేతుబద్ధమైనదేనని, భవిష్యత్‌లో విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story

Most Viewed