మండలాఫీసు ముందు ఖాళీ బిందెలు

by  |
మండలాఫీసు ముందు ఖాళీ బిందెలు
X

దిశ, ఇబ్రహీపట్నం: నాలుగు నెలలుగా త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న యాచారం మండలం నందివనపర్తి అనుబంధ గ్రామంలో కొమ్మని బాయి గ్రామస్థుల బాధలను “తాగునీటికై తండ్లాట” అనే దిశ కథనానికి స్పందించి ఆ గ్రామప్రజలకు మద్దతుగా బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యాచారం చౌరస్తా నుండి మండల ఆఫీస్ వరకు వర్షంలోనే సుమారు ఒక మీటరు దూరం ఖాళీ బిందెలతో మా గ్రామానికి తాగునీరు అందించాలని, అధికారుల మొండి వైఖరి నసించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల ఆఫీసు ముందు ధర్నా చేశారు.

Next Story

Most Viewed