కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నేత సహా పలువురు ఆందోళన.. ప్రభుత్వానికి హెచ్చరిక!

by  |
kphb1
X

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీ కాలనీలోని మూడవ ఫేజ్​ఎంఐజీ20/1లో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దని స్థానికులు గురువారం నిరసన తెలిపారు. కాలనీ మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగి రెడ్డి మురళి, టీఆర్ఎస్ ​నాయకుడు జనగాం సురేష్ రెడ్డి, జనసేన నాయకుడు కొల్లా శంకర్, చెన్నారెడ్డి, అంజి, మహిళలు పాల్గొన్నారు.


Next Story