పోలీస్ శాఖలో పదోన్నతులు.. డీజీపీ కీలక ఉత్తర్వులు జారీ

by  |
DGP-Mahender-Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : పోలీస్ శాఖలో 15 మంది ఏఆర్ పోలీసులను డిప్యూటీ సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి ప్రమోషన్‌తో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న చోటు నుంచి వేరే చోటుకి బదిలీ చేశారు.

15 రోజుల్లోగా రిపోర్టింగ్ చేయాలని, ఏమాత్రం ఆలస్యమైనా శాఖ పరమైన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముగ్గురు ఏసీపీలు, ఐదుగురు డీఎస్పీలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.



Next Story

Most Viewed