ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయండి : మంత్రి ఎర్ర బెల్లి

by  |
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయండి : మంత్రి ఎర్ర బెల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు జిల్లా పరిషత్​ అధికారులకు సూచించారు. టీఆర్​ఎస్ ​సర్కార్​ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పారు. సోమవారం పద్నోన్నతులు పొందిన జిల్లా పరిషత్​ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు హైదరాబాద్‌ లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే అధికారులకు టీఆర్​ఎస్​ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ సకాలంలో చేరవేయాలని సూచించారు.



Next Story

Most Viewed