దామగుండం కాల్పుల కేసులో ట్విస్ట్

by  |
దామగుండం కాల్పుల కేసులో ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఈనెల 24న కాల్పుల ఘటనలో పురోగతి లభించింది. అటవీప్రాంతంలో గడ్డిమేస్తున్న ఆవును కాల్చి చంపిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. అటవీప్రాంతంలో ఓ ప్రముఖ క్రీడాకారిణీ, ఆమె బంధువులకు సంబంధించిన ఫాంహౌస్‌లు ఉన్నాయని అందులో ఉండే వారే కాల్పులకు పాల్పడి ఉంటారని.. ఆవు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు.. ఫాంహౌస్ ఇన్‌ఛార్జ్‌ను అరెస్ట్ చేశారు. కాల్పులు ఎందుకు జరిపారు, తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed