కత్రినా, సేతుపతి మెర్రీ క్రిస్‌మస్‌పై అప్‌డేట్

by  |
కత్రినా, సేతుపతి మెర్రీ క్రిస్‌మస్‌పై అప్‌డేట్
X

దిశ, సినిమా : కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో ‘అంధాదున్’ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెర్రీ క్రిస్‌మస్’. ప్రముఖ నిర్మాత రమేష్ తౌరాని ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ముందుగా మే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వాయిదా వేసినట్టు ప్రొడ్యూసర్ తౌరాని వెల్లడించారు. ఈ మేరకు లాక్‌డౌన్ పూర్తిగా ముగిసిన తర్వాతే షెడ్యూల్ నిర్ణయిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 90 శాతం మేర లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొన్నందున షూటింగ్ చేయడం కుదరదన్న తౌరాని.. ఒకటి రెండు వారాల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని చెప్పారు. పరిస్థితులు అనుకూలించాక ముంబైతో పాటు గోవా, పుణెలో చిత్రీకరణ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

కాగా విజయ్ సేతుపతి.. షాహిద్ కపూర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న వెబ్ షోతో పాటు సంతోష్ శివన్ ‘ముంబైకర్’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక రోహిత్ శెట్టి ‘సూర్యవంశీ’, గుర్మీత్ సింగ్ ‘ఫోన్ బూత్’లో నటిస్తున్న కత్రినా.. అలీ అబ్బాస్ జాఫర్ మూవీలో సూపర్ హీరో పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed