కిసాన్ మహా పంచాయతీకి ప్రియాంక గాంధీ..

by  |
కిసాన్ మహా పంచాయతీకి ప్రియాంక గాంధీ..
X

దిశ వెబ్ డెస్క్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతు తెలిపేందుకు ఉత్తర ప్రదేశ్ లోని 28 జిల్లాలో కిసాన్ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దీనిలోని భాగంగా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్ర ఉత్తర ప్రదేశ్ లోని మీర్ టూలో కిసాన్ మహా పంచాయతీలో రైతుల సమస్యల గురించి ప్రసంగించనున్నారు.

ఉత్తర ప్రదేశ్ లోని సహా నాపూర్ లో జైజవాన్ జైకిసాన్ అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరీ 10 న ప్రియాంక గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ మసూద్ నిర్యహించిన ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ వాద్ర ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ చీఫ్ అజయ్ సింగ్ లాలు , పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed