రెండు నెలల తర్వాత బయట అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా

by  |
రెండు నెలల తర్వాత బయట అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రియాంక చోప్రా త‌న అందం, అభినయంతో అశేష ప్రేక్షకుల అభిమాన తారగా ఎదిగింది. ప్రపంచ సుందరిగా కిరీటం అందుకున్న ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా అపూర్వ విజయాలు అందుకుంది. తన నటనతో హాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుని తానేంటో నిరూపించుకుంది. గ్లోబర్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక, నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక కరోనా వైరస్‌ కారణంగా ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ జంట అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను తరచు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ప్రియాంక. తాజాగా రెండు నెలల తర్వాత ఇంటి నుంచి కాలు బయటపెట్టానని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

క‌రోనా వైర‌స్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో సామాన్యులు నుంచి సెల‌బ్రిటీలు వరకు అందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో లాక్డౌన్ తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు నెలల తర్వాత ముఖానికి మాస్క్ పెట్టుకుని బయటకు వచ్చిన ఫోటోను ప్రియాంక తన ఇన్స్ స్టాగ్రాం ద్వారా పంచుకుంది. ‘‘ కళ్ళు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు.. 2 నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కి వ‌చ్చాను. మాస్క్‌కి ధ‌న్యవాదాలు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ జత చేసింది. కళ్లు మాత్రమే కనిపించేలా ఉన్న ఈ ఫోటోపై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర ‘మీ కళ్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి’ అని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రపంచవ్యాప్త నెటిజన్లు సెర్చ్‌ చేసిన ఇండియన్‌ సెలబ్రిటీల జాబితాను ఓ ఆన్‌లైన్‌ సర్వే ద్వారా వెల్లడించింది ఓ సంస్థ. టాప్‌ టెన్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఇండియన్‌ ఉమెన్‌ సెలబ్రిటీల్లో ప్రియాంకా చోప్రా టాప్ పొజిషన్ లో నిలిచింది.

Next Story