కోవిడ్ సెంటర్ నుంచి ఖైదీలు పరార్

by  |
కోవిడ్ సెంటర్ నుంచి ఖైదీలు పరార్
X

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలో సీసీఆర్ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందులో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే అందులో ఇద్దరు ఖైదీలు కూడా చికిత్స తీసుకుంటున్నారు.

తప్పించుకునేందుకు ఇదే అదును అని భావించిన ఆ ఇద్దరు ఖైదీలు ఆ కోవిడ్ సెంటర్ నుంచి పరారయ్యారు. పారిపోయిన ఆ ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు.

Next Story

Most Viewed