గాంధీ నుంచి ఖైదీల పరారీ కేసు: నరసింహదే ప్లాన్ ?

by  |
గాంధీ నుంచి ఖైదీల పరారీ కేసు: నరసింహదే ప్లాన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరారైన నలుగురు ఖైదీల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నలుగురు నిందితుల ఫొటోలను విడుదల చేశారు. ఇతర రాష్ట్రాలకు కూడా సిటీ పోలీస్ బృందాలు వెళ్లాయి. ఈ నలుగురు ఖైదీల్లో ఒకరు నరసింహా. నరసింహానే.. ఈ ఖైదీలు ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రేప్ కేస్ తోపాటు ఫోర్జరీ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నరసింహా గతంలోనూ మానసిక ఆస్పత్రి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.


Next Story

Most Viewed