కాశీ లో ప్రధాని.. కాషాయ వస్ర్తాలతో నమోస్తు గంగే(వీడియో)

by  |
కాశీ లో ప్రధాని.. కాషాయ వస్ర్తాలతో నమోస్తు గంగే(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కాశీ విశ్వనాథ్ కారిడార్ ను జాతికి అంకితం చేయడానికి సోమవారం ప్రధాని మోదీ కాశీలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. మొదటగా కాషాయ వస్ర్తాలతో గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు.

శివ ధ్యానంతో పరవశించిపోయారు. లలితా ఘాట్ వద్ద గంగామాత కు పూలను అర్పించారు. తర్వాత గంగా జలాన్ని తీసుకుని బాబా విశ్వనాథుని వద్దకు వెళ్లారు. కాశీ విశ్వనాథునికి గంగా జలంతో అభిషేకం చేశారు. జోతిర్లింగ క్షేత్రమైన కాశీలో చాలా కాలం తర్వాత పర్యటిస్తున్నారు.


Next Story

Most Viewed