తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్

by  |
తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. బుధవారం సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రధానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వివరించగా… వర్షాలు, వరదలు తగ్గి సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయని సీఎం జగన్‌ చెప్పారు. కేంద్రం తరపున అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ ఇద్దరు సీఎంలకు హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed