- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో దూసుకువెళ్తున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించిన ఆయన.. అనంతరం ప్రత్యేక విమానంలో నేరుగా హకీంపేట ఎయిర్బేస్కు చేరుకున్నారు. పీఎంవో సూచించిన ఐదుమంది ఉన్నతాధికారులు.. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సీపీ సజ్జనార్, ఎయిర్ఫోర్సు అధికారులు మోడీకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం మీదుగా భారత్ బయోటెక్కు వెళ్లారు. ఇక భారత్ బయోటెక్లో కూడా ప్రధాని మోడీ కొవాగ్జిన్ పురోగతిని పరిశీలిస్తున్నారు. సైంటిస్టుల నుంచి వ్యాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
Next Story