లాక్ డౌన్ : ఆశిర్వాద్ ఆట గోధుమ పిండి అంటే జైల్లో వేయండి

by  |
లాక్ డౌన్ : ఆశిర్వాద్ ఆట గోధుమ పిండి అంటే జైల్లో వేయండి
X

దిశ,వెబ్‌డెస్క్: కరోనా కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన అన్నీ సేవల్ని రద్దు చేస్తున్నాయి. అయితే యూకేలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆదేశ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం అర్ధరాత్రి నుంచి రెండో సారి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసింది.

ఈ లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోరిస్ జాన్సన్ ఆదేశాలు జారీ చేశారు. తొలిసారి లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.20వేలు, రెండో సారి ఉల్లంఘిస్తే రూ.6.36 లక్షలు ఫైన్ కట్టాల్సి ఉంది. ఇక ఒడియాలు పెట్టుకోవాలి. లేదంటే ఆశిర్వాద్ ఆట గోధుమ పిండి’ కోసం బయటకు వచ్చామని సిల్లీ రీజన్ చెబితే జైల్లో పెట్టాలని అధికారులకు సూచించారు.

కాగా యూకేలో గడిచిన 24 గంటల్లో కొత్త కరోనా వైరస్ 58,784 మందికి సోకగా, 407 మంది మరణించారు. ఇక ఈ లాక్ డౌన్ ఆరు వారాల పాటు అమలు కానుంది. ఫిబ్రవరి రెండో వారంలో లాక్ డౌన్ పై ప్రధాని బోరిస్ జాన్సన్ సమీక్షించనున్నారు.



Next Story

Most Viewed