రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ సక్సెస్

by  |
రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ సక్సెస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన బైపాస్ సర్జరీ సక్సెస్ అయింది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ నిర్వహించినందుకు డాక్టర్లకు కంగ్రాట్స్. రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం గురించి ఎయిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడాను’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కోవింద్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కాగా గత కొద్దిరోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో.. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి కార్యాలయ సిబ్బంది ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆర్మీ ఆస్పత్రి వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు.



Next Story

Most Viewed