భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు..

by  |
భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ విదేశాల్లో విస్తరించియున్న భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పర్వదినాన అందరూ సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగ మీ అందరీ ఇళ్లలోనూ వెలుగులు నింపాలని కోరారు. అంతేకాకుండా, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు.

దేశ ప్రజలకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ అందరి జీవితాలను మరింత ప్రకాశవంతంగా చేయాలని, ఆనందాన్ని చేకూర్చాలని, సుసంపన్నులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.



Next Story