దుబ్బాక వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

by  |
siddipeta collecter
X

దిశ సిద్దిపేట: దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని డిసెంబర్ 25 వ తేదీన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులను 24 తేదీ కల్లా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.వైద్య అధికారులతో కలిసి బుధవారం వంద పడకల ఆసుపత్రి చివరి దశలో నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరిశీలించారు . పనులు తుది దశకు చేరుకున్నందున పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి ఆసుపత్రి ప్రారంభానికి సన్నద్ధం చేయాలన్నారు.


Next Story