- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దేవరకొండ: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించి మండలికి పంపిస్తే నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతానని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బహుజన రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లాలూ నాయక్, దళిత యువజన జేఏసీ కన్వీనర్ ఎర్ర కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యను వ్యాపారం చేస్తున్న పల్లా రాజేశ్వర్రెడ్డికి పట్టభద్రులు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పట్టభద్రుల సమస్యలపై ఏనాడు నోరు విప్పలేదని ఆరోపించారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే అధికారం ఒక్క కుటుంబం చేతుల్లోనే ఉందని.. ఈ పాలనలో ప్రశ్నించే బలమైన గొంతుకను శాసనమండలికి పంపాలని కోరారు.