కరోనాపై 'అ!' డైరెక్టర్ మూవీ

by  |
కరోనాపై అ! డైరెక్టర్ మూవీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు దర్శకులు. ఇప్పటికే కరోనాపై సినిమా చేస్తున్నట్లు ఇతర ఇండస్ట్రీల డైరెక్టర్లు ప్రకటించారు. కొందరు దర్శక నిర్మాతలు టైటిల్ కూడా రిజిస్టార్ చేయించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కోవిడ్ 19పై చిత్రాన్ని తెరకెక్కించనున్నారని ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. వైవిద్యభరితమైన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డు పొందిన ఈ సినిమాలో కాజల్, నిత్యామీనన్, ఇషా రెబ్బా, రెజీనా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. నేషనల్ లెవల్‌లో సినిమాకు ప్రశంసలు దక్కాయి. దీంతో ‘అ!’ సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ మంచి నిర్మాత కోసం వెయిట్ చేస్తున్నాడట.

ఇదిలా ఉంటే 2019లో కరోనా వైరస్ విజృంభణ, ప్రపంచంపై కోవిడ్ 19 ప్రభావం అంశాల నేపథ్యంలో సినిమా చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ మేరకు చాలా వివరాలు కూడా సేకరించిన డైరెక్టర్.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడట. అంతేకాదు మూవీపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్న ప్రశాంత్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడట. మరి ‘అ!’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు.. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అవుతాడేమో చూడాలి.

Tags: CoronaVirus, Prashanth Varma, Covid19, Movie


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed