- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్లో ‘మా’ గొడవ మరింత ముదిరింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్పై మంచు విష్ణు విజయం సాధించి.. మా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ, పరాజయం పొందిన ప్రకాశ్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఈసీ అందుకు అంగీకరించలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు కూడా రాజీనామా బాటలోనే ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు.
మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రిగ్గింగ్కు పాల్పడిందని.. ఇందుకోసం సోమవారం కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇదివరకే ఎన్నికలు జరిగిన తీరుపై పూర్తి సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్కు ఓపెన్ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కోర్టు మెట్లు ఎక్కెందుకు కూడా సిద్ధం అవడంతో టాలీవుడ్లో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దీనిపై ప్రస్తుత మా అధ్యక్షుడు విష్ణు ఎలా స్పందిస్తాడో అనేది వేచి చూడాల్సిందే.