కరోనా ప్రభావం… ప్రభాస్ షూటింగ్ రద్దు

by  |
కరోనా ప్రభావం… ప్రభాస్ షూటింగ్ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత చేస్తున్న చిత్రం ‘ఓ డియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్‌తో జతకడుతుంది హీరోయిన్ పూజా హెగ్డే. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ ముగిశాక ఆస్ట్రేలియాలో షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో చిత్ర యూనిట్ ఆస్ట్రేలియా షూటింగ్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. అక్కడికి వెళ్లే బదులు హైదరాబాద్‌లోనే ప్రత్యేక సెట్స్ వేసి.. షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథలో లవర్ ఫేం హీరోయిన్ రిద్ది కుమార్ కూడా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ అవుతుందని సమాచారం.

tags: Prabhas, Prabhas O Dear, O Dear, Puja Hegde, Radha Krishna, UV Creations

Next Story

Most Viewed