- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : ప్రభాస్-నాగ్ అశ్విన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్కు ముహూర్తం కుదిరింది. సోషియా ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవనుంది. ఈ మేరకు శుక్రవారం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్.. కొత్త వాతావరణంలో, కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనబోతునట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న బిగ్ బీ.. హైదరాబాద్లో జరగనున్న షార్ట్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. అయితే ముహూర్తపు షాట్ ఎవరిపై చిత్రీకరిస్తారో తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను వైజయంతి ప్రొడక్షన్ హౌస్ మరుసటి రోజు షేర్ చేయనుంది.
ఇక ప్రభాస్ జోడీగా దీపికా పదుకొనే నటిస్తుండగా.. తను నెక్ట్స్ షెడ్యూల్లో మూవీ యూనిట్తో కలవనుంది. కాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏడాది కాలంగా ప్రీప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉండగా.. ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెంటార్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.