ఆ నగరాల్లో రెనాల్ట్ కొత్త షోరూంలు

by  |
ఆ నగరాల్లో రెనాల్ట్ కొత్త షోరూంలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా అతిపెద్ద ఆటోమొబైల్ రిటైలర్లలో ఒకటైన పీపీఎస్ మోటార్స్ తెలంగాణలో ఐదు కొత్త రెనాల్ట్ షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నగరంలో మూడు, నిజామాబాద్, వరంగల్‌లల్లో ఒక్కోటి చొప్పున షోరూమ్‌లను ప్రారంభించడం ద్వారా తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ మరింత బలపడుతుందని కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘రెనాల్డ్ ఇండియాతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేలా తెలంగాణలో డీలర్‌షిప్‌లను విస్తరించడం సంతోషంగా ఉందని’ పీపీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి చెప్పారు.

2010లో ప్రారంభమైన పీపీఎస్ మోటార్స్ తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో స్కోడా, రెనాల్ట్, భారత్ బెంజ్ వంటి బ్రాండ్లకు రిటైలర్‌గా వ్యవహరిస్తోంది. పీపీఎస్ మోటార్స్ భారత్‌లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికను సిద్ధం చేసిందని, మరో ఏడాదిలోగా కొత్త 75 ప్రాంతాల్లో టచ్ పాయింట్లను విస్తరించాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. కాగా, పీపీఎస్ మోటార్స్ 1,200 మందికి పైగా ఉద్యోగులకు కలిగి ఉంది.



Next Story

Most Viewed