ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

by  |
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్టు 15న కాకుండా మరో తేదీన పంపిణీ చేసే అవకాశముంది. కాగా, ఈ విషయమై బుధవారం డిప్యూటీ సీఎం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 3 రాజధానుల నిర్మాణం ఖచ్చితంగా జరుగుతదని నొక్కి చెప్పారు. త్వరలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతదని వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ తేదీని మార్చే అవకాశమున్నదని, ఆగస్టు 15న కాకుండా మరో తేదీన పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ విషయాలపై ప్రతిపక్షంపై మండిపడుతూ టీడీపీ స్వార్థ రాజకీయాలతో ఆడుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed