వాయిదా……పడింది

by  |
వాయిదా……పడింది
X

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ ప్రకటన చేసింది. జూలై 2వ తేదీకి ఎలిజిబిలిటీ టెస్ట్-2020 ను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నది. పరీక్షా సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అని తెలిపింది. అదేవిధంగా మరో విషయం కూడా వెల్లడించింది. అదేమిటంటే.. గత మార్చిలో వాయిదా వేసిన యూజీ సెమిస్టర్-1 పరీక్షలు జూన్ 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించవచ్చని తెలిపింది.



Next Story