ముగ్గురు పాన్ ఇండియా హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్?

by  |
ముగ్గురు పాన్ ఇండియా హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్?
X

దిశ, సినిమా: ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సంక్రాంతి కానుకగా రిలీజై తమిళనాట రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీ రోల్ ప్లే చేయగా.. విజయ్‌కు జోడీగా నటించిన మాళవిక మోహనన్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. కాగా ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే విజయ్ తన 65వ సినిమా ప్రకటించాడు.

టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా #Thalapathy65 స్క్రిప్ట్ ముగ్గురు హీరోయిన్లను డిమాండ్ చేస్తోందని, అందుకోసం పాన్ ఇండియా లెవల్ హీరోయిన్లనే తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు కియారా అద్వానీ, రష్మికా మందన, పూజా హెగ్డే పేర్లను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా ఈ ముగ్గురిలో ఎవరు ఆ అవకాశం దక్కించుకుంటారో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.



Next Story

Most Viewed