ఆమె మరణ వార్త విని గుండెలు పగిలేలా రోదించిన పూజా హెగ్డే..

by  |
ఆమె మరణ వార్త విని గుండెలు పగిలేలా రోదించిన పూజా హెగ్డే..
X

దిశ, సినిమా : హీరోయిన్ పూజా హెగ్డే టీచర్ మరణవార్తతో గుండె పగిలిపోయిందని బాధపడింది. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని తెలిపింది. ఢిల్లీలోని మానెక్‌జీ కూపర్ స్కూల్‌లో చదివి ఉంటే మీకు తన గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. డౌన్‌గా ఫీల్ అయిన ప్రతీసారి తనే ధైర్యం చెప్పేదని, కొంత మంది టీచర్లు ప్యూర్ గోల్డ్ అని బాధపడింది. తాను ఇప్పుడున్న పొజిషన్‌కు ఎదిగేలా చేసిన టీచర్ మాటలను ఎప్పుడూ మరిచిపోలేనన్న పూజ.. తను జియోగ్రఫీ టీచర్ అయినా జీవితం గురించి నేర్పిందని, తనలో ఉన్న ఇంటెలిజెన్స్‌, యూనిక్‌నెస్‌ను ముందుగా తనే గుర్తించిందని వెల్లడించింది.



Next Story