కేసీఆర్‌ది లీకులు, ప్రెస్‌నోట్ల పాలన: పొన్నాల లక్ష్మయ్య

by  |
కేసీఆర్‌ది లీకులు, ప్రెస్‌నోట్ల పాలన: పొన్నాల లక్ష్మయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ది లీకులు, ప్రెస్‌నోట్ల పాలనని విమర్శించారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల వద్దకు వెళ్దాం వస్తావా కేసీఆర్ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములే కోటి 30లక్షల ఎకరాలు ఉంటే, కోటి 10లక్షల ఎకరాల్లో సాగు అయ్యిందని ఎలా చెబుతున్నారని మండిపడ్డారు. 45లక్షల ఎకరాల కంటే ఎక్కువ వరి సాగులేదని, అసలు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎన్ని, ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాపాలు కేటీఆర్‌కి అంటగడతారని, అందుకే ఆయనకు సీఎం పగ్గాలు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed