పోలింగ్ అప్డేట్: మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ శాతం..!

by  |
పోలింగ్ అప్డేట్: మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ శాతం..!
X

దిశ, వెబ్ డెస్క్ : నాగార్జున సాగర్ లో ఉపఎన్నిక కు ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ జరుగగా, మధ్యాహ్నం 1గంట వరకు 53.3 శాతం పోలింగ్ జరిగింది. అంతేకాకుండా 3గంటల వరకు 69 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Next Story