- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Speaker of Lok Sabha : నేను ఐఏఎస్ తండ్రిని.. గర్వంగా చెప్పుకున్న లోక్సభ స్పీకర్
నేడు లోక్సభ స్పీకర్గా రాజకీయ దిగ్గజుడు, ఓటమి ఎరుగని నాయకుడుగా పేరుగాంచిన ఓం బిర్లా ఎంపిక అయ్యారు.

దిశ వెబ్ డెస్క్: నేడు లోక్సభ స్పీకర్గా రాజకీయ దిగ్గజుడు, ఓటమి ఎరుగని నాయకుడుగా పేరుగాంచిన ఓం బిర్లా ఎంపిక అయ్యారు. కాగా ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ఎన్నికవడం ఇది రెండవసారి. అయితే భారత దేశ చరిత్రలోనే లోక్సభ స్పీకర్గా రెండుసార్లు నియమితులైన వారిలో ఈయన రెండవ వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. తన భార్య పేరు అమిత బిర్లా అని, వారికి ఆకాంక్ష, అంజలి బిర్లా ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పేర్కొన్నారు.
కాగ తన చిన్న కూతురు అంజలి బిర్లా ఐఏస్ ఆఫీసర్ అని గర్వంగా తెలిపారు. అలానే అంజలి మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షను చేదించినట్టు వెల్లడించారు. కాగా అంజలీ బిర్లా తన పాఠశాల విద్యాభ్యాసం తరువాత పొలిటికల్ సైన్స్లో చేరారు. అలా కాళాశలో చదువుకుంటున్న సమయంలోనే UPSCకి ప్రిపేర్ అయ్యారు. కాగా 2019లో UPSC పరీక్ష రాసి మెదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. కాగా ప్రస్తుతం ఆమె రైల్వే మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు.






