- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రిపుర సీఎంగా మళ్లీ మానిక్ సాహానే
త్రిపుర సీఎంగా మానిక్ సాహాను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: 60 స్థానాలు గల త్రిపుర అసెంబ్లీకి ఇటేవలే ఎన్నికలు పూర్తయ్యాయి. 33 స్థానాలు గెల్చుకున్న అధికార బీజేపీ మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతోన్న మానిక్ సాహానే మళ్లీ సీఎంగా కొనసాగించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ప్రస్తుత సీఎం మానిక్ సాహానే మళ్లీ సీఎంగా ఎన్నుకుంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 8న జరగనుంది.
పీఎం మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది మే నెలలో మానిక్ సాహా త్రిపుర సీఎంగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పెద్దల ఆశీస్సులతో త్రిపుర ఎన్నికల్లో మానిక్ సాహా అన్ని తానై వ్యవహరించారు. ఈ కారణంగానే ఆయనకు మరోసారి సీఎం పదవిని కట్టబెడుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీలో చర్చించుకుంటున్నారు.






