మాది మాయా ఫెస్టో కాదు.. వైసీపీని మాయం చేసే మేనిఫెస్టో: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు

by Dishafeatures2 |
మాది మాయా ఫెస్టో కాదు.. వైసీపీని మాయం చేసే మేనిఫెస్టో: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో వైసీపీ మాయం అవ్వడం ఖాయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అన్నారు. మహానాడులో తెలుగుదేశం ఇచ్చిన మొదటి ఫేజ్ మేనిఫెస్టో వైసీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందని రోజూ వాళ్ల ఉలిక్కిపాటు చూస్తేనే అర్థం అవుతుంది అని అన్నారు. టీడీపీ మేనిఫెస్టో మాయాఫెస్టో...కాపీ పేస్ట్ మేనిఫెస్టో అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డికి అదేస్థాయిలో అయ్యన్నపాత్రుడు సైతం కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సాయిరెడ్డికి ఉనికి సమస్య మొదలైనట్లు ఉంది అని విమర్శించారు.

చాలా రోజుల తరువాత పార్టీ ఆఫీస్‌కు వచ్చిన విజయసాయిరెడ్డి టీడీపీ మేనిఫెస్టో పై విమర్శలు చేసి జగన్ దృష్టిలో పడేందుకు నానా పాట్లు పడుతున్నారు అని విమర్శించారు. రూ.2 కిలో బియ్యం వంటి కొత్త పథకాలు.....మహిళలకు ఆస్తిహక్కు వంటి నిర్ణయాలు....ప్రజల వద్దకు పాలన వంటి సంస్కరణలు....జన్మభూమి వంటి కార్యక్రమాలు...విజన్- 2020తో ప్రజల బతుకులు మార్చిన ఆలోచనలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎవరినీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదని మీరు...మీ పేటీఎం గాళ్లు తెలుసుకోవాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశం రేపు చేసే ఆలోచనను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఆలోచించి అమలు చేస్తారు అని చెప్పుకొచ్చారు.అదీ చంద్రబాబు గట్స్...విజన్ అని కొనియాడారు.

4 దశాబ్దాల తెలుగుదేశం తెచ్చిన పాలసీలను...తర్వాత దేశం ఫాలో అయ్యిందన్న విషయం నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన మీకు ఎలా తెలుస్తుందిలే అంటూ సెటైర్లు వేశారు. ‘మేం ప్రకటించింది మాయా ఫెస్టో కాదు....ఏపీ రాజకీయాల నుంచి వైసీపీని మాయం చేసే తిరుగులేని మేనిఫెస్టో. సాయిరెడ్డీ...మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం నిజం ఉంది....అందరినీ అన్నివేళలా ఎవరూ మోసం చేయలేరు. ఒక్క ఛాన్స్ తో మీరు చేసిన మోసాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు...మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా మళ్లీ ప్రజలను మోసం చెయ్యలేరు’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అని అన్నారు.

.Also Read..

కోడెల శివరాంకు నిరసన సెగ



Next Story