మునుగోడుపై Revanth Reddy స్పెషల్ ఫోకస్.. రేపే రంగంలోకి

by Dishanational2 |
మునుగోడుపై Revanth Reddy  స్పెషల్ ఫోకస్.. రేపే రంగంలోకి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మనుగోడులో రాజకీయ రణరగం మొదలైంది. పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు పోటి పడుతున్నాయి. ఈ క్రమంలో నియోజక వర్గంలో నాయకులు పర్యటిస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో కాంగ్రెస్‌కు అడ్డా అయిన మునుగోడు‌పై తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి 'మన మునుగోడు, మన కాంగ్రెస్' పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా శుక్రవారం ఉదయం విడుదల చేశారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా శనివారం మునుగోడు నియోజక వర్గంలోని 176 గ్రామాలలో జయంతి వేడుుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలంతా పాల్గొని ప్రతి గ్రామంలో జెండా ఎగురవేసి, రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించనున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా రేపు మునుగోడకు వెళ్లి రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 21 నుంచి మండలాల వారీగా పర్యటించనున్నారు.


Next Story