కిషన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మాజీ మంత్రి

by Disha Web Desk 11 |
కిషన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మాజీ మంత్రి
X

దిశ,అంబర్ పేట: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంబర్ పేట నియోజకవర్గంలోని డివిజన్లకు సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బర్కత్ పుర బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్ మాట్లాడుతూ… అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు, గల్లీ గల్లీ కి వెళ్లి వివరించాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరించాలని చెప్పారు. దేశానికి సుస్థిర పాలన అందిస్తున్న మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకునేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జులు భరత్ గౌడ్, శ్రీనివాస్, మోహన్, ఎక్స్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



Next Story