మోడీకి కుటుంబం ఉంటే బాధలు తెలిసేవి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 6 |
మోడీకి కుటుంబం ఉంటే బాధలు తెలిసేవి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కానీ అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ప్రధాని విమర్శించారు. కాగా ప్రధాని వ్యాఖ్యలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. మోడీకి కుటుంబం ఉంటే బాధలు తెలిసేవి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రానికి ప్రధాని ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

తెలంగాణ నిధులు గుజరాత్ లో ఖర్చు పెడుతున్నందుకు సహకరించాలా అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్ ను ప్రశ్నించినందుకు సహకరించాలా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారన్న ఆయన.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదని స్పష్టం చేశారు. మోడీని గద్దె దింపేవరకు వదిలిపెట్టమన్న మంత్రి.. ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed