మీర్ పేట్ కార్పొరేషన్ కు రూ. 2. 40 కోట్లు మంజూరు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
మీర్ పేట్ కార్పొరేషన్ కు రూ. 2. 40 కోట్లు  మంజూరు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు వద్ద లైటింగ్ ఏర్పాటుకు రూ. కోటి 25 లక్షలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లైటింగ్ ఏర్పాటుకు రూ. కోటి 15 లక్షల నిధులు మంజూరు అయ్యాయాని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కృషితో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

ఇటీవలే ఈ నాలుగు పట్టణాలకు రూ. 150 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేస్తున్నట్లు, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్న సీఎం కేసీఆర్ కి మంత్రి నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.

Next Story