చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Dishafeatures2 |
చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తిరుపతి: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన ఆయన జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు సామాజిక వర్గాలు 75 ఏళ్లుగా దోచుకుంటున్నాయని చింతామోహన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీలో రెండున్నర సంవత్సరాలు కాపులకు అధికారం ఇస్తామని, రెండున్నర సంవత్సరాలు ఓబీసీలకు అధికారం ఇస్తామని చింతామోహన్ పేర్కొన్నారు.

గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేది అని చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో సమీకరణాలు రాజకీయాలు తెలియకనే చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయారు అని చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు చిరంజీవి మంచి మిత్రుడు అని తెలిపిన చింతా మోహన్ ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న రాజకీయాలపై పెదవి విరిచారు.

Read More: శృంగారానికి బానిసైన బాలీవుడ్ బ్యూటీ.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్

Niharika Konidela :మెగా డాటర్ నిహారిక మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

BRO సినిమా అప్‌డేట్: సాయితేజ్ ఫస్ట్ లుక్‌ విడుదల


Next Story