నగరంలో డబ్బుల పంపిణీ.. ఉదయం నుంచే ప్రలోభాలు స్టార్ట్

by Kodari Anjali |

తెలంగాణలో నిన్న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ర

నగరంలో డబ్బుల పంపిణీ.. ఉదయం నుంచే ప్రలోభాలు స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిన్న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ సందర్భంగా.. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులు ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకుని డబ్బుల పంపిణీ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచే ఇంటింటికీ పోయి చేతిలో డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీల ద్వారా ఓటర్ల ఫోన్ ​నంబర్లను సేకరించిన నాయకులు.. కొందరికి ఫోన్​చేసి ఫలానా వారు వస్తారని చెబుతున్నారు. ఒక్క ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 ఇచ్చి వెళ్తున్నారని కొందరు ఓటర్లు వెల్లడించారు. పగలయితే డబ్బులు ఇస్తున్నారని తెలిసిపోతుందనే, తెల్లవారుజామున ఓటర్లకు మనీ ఇవ్వడానికి వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో డబ్బు అందని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి ఇవ్వట్లేదని నాయకులపై మండిపడుతున్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్, అంబర్​పేట, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరుగుతున్నట్టు సమాచారం.ః

Next Story