AP Politics: భలే మంచి రోజు.. పురోహితులతో నేతల చర్చలు.. దానికోసమేనా..?

by Disha Web Desk 3 |
AP Politics: భలే మంచి రోజు.. పురోహితులతో నేతల చర్చలు.. దానికోసమేనా..?
X

దిశ, ఏలూరు: చైత్ర మాసంలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అభ్యర్థులు పురోహితులను, జోతిష్కులను కలుసుకుని మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలి రోజే భారీగా నామినేషన్లు పడతాయని భావించారు.

అయితే దశమి తిథి మంచిదైనా, పెద్దగా స్పందన కానరాలేదు. 19 ఏకాదశి నాడు అభ్యర్థులు ముహూర్తం పెట్టుకున్నారు. 19న దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఆచంట వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాధరాజు నామినేషన్ వేయనున్నారు. 20న ద్వాదశి తిథి రావడంతో పెద్దగా నామినేషన్లు రావని భావిస్తున్నారు. 21 త్రయోదశి, 22న చతుర్దశి, పౌర్ణమి తిథులు మంచివనే భావనతో ఆ రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Next Story

Most Viewed