కృష్ణయ్య హత్యను ఖండించిన తమ్మినేని వీరభద్రం

by Disha Web Desk 2 |
కృష్ణయ్య హత్యను ఖండించిన తమ్మినేని వీరభద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కృష్ణయ్య హత్య విషయంలో తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాగా, తన భర్తను తమ్మినేని వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్శరరావులే హత్య చేయించారని కృష్ణయ్య భార్య ఆరోపించిన విషయం తెలిసిందే.

మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం పార్టీ పోటీ చేయడం లేదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బీజేపీని ఓడించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని, మద్దతు విషయమై త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మరోపక్క, సీపీఎం నేతలు కూడా తమతో కలిసి వస్తున్నారని మునుగోడు బహిరంగ సభలో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed