మునుగోడులో మా లక్ష్యం అదే.. CPI నారాయణ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk |
మునుగోడులో మా లక్ష్యం అదే.. CPI నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తమ పార్టీకి బలం ఉందని, గతంలో ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. అంతేగాక, మా ముందు మూడు ఆప్షన్లు కూడా ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. రేపు మధ్యాహ్నం(ఆగస్టు 20) తమ పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. మునుగోడులో గెలుపోటములు తామే డిసైడ్ చేస్తామని, ముందు బీజేపీని ఓడించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.


Next Story

Most Viewed