'లిక్కర్ పాలసీలో ముమ్మాటికి అవినీతి జరిగింది'

by Disha Web Desk 2 |
లిక్కర్ పాలసీలో ముమ్మాటికి అవినీతి జరిగింది
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ పాలసీ కుంభకోణం వ్యవహారంలో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లిక్కర్ పాలసీలో ముమ్మాటికి అవినీతి జరిగిందని కుండబద్దలు కొట్టారు. తాము చేసిన ఆరోపణలకు ఆప్ ఇంతరకు సమాధానం చెప్పలేదని విమర్శించారు. కాగా, మరోవైపు బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేసింది. బీజేపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కవిత ఫిర్యాదు చేసింది. తనపై బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దర్యాప్తుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కవిత స్పష్టం చేసింది.

Next Story