గాంధీలో దారుణం.. పేషెంట్ బధువులను గెంటేసిన పోలీసులు

by  |
గాంధీలో దారుణం.. పేషెంట్ బధువులను గెంటేసిన పోలీసులు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గాంధీ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రివేళ రోగుల బంధువులను గెంటి వేయడం వివాదానికి దారి తీసింది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరమంతా కర్ఫ్యూ అమలులో ఉండగా గాంధీ హాస్పిటల్లోని ఐసియూలో ఉన్న పేషంట్ల బంధువులను హాస్పిటల్ నుంచి పంపించి వేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో వారు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న ఇబ్బందులను సోమవారం ఉదయం మీడియా ముందు పెట్టేందుకు వారు ప్రయత్నం చేస్తుండగా అక్కడి నుండి వెళ్లి పోవాలని హుకుం జారీ చేశారు. పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల సహాయకులలో ఒకరిని హాస్పిటల్ లో ఉండేలా అనుమతించాలని డిమాండ్ చేశారు.



Next Story